
జనరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన, దేశవ్యాప్తంగా అవసరానికి సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ప్రపంచ పరిస్థితులపై స్పందిస్తూ, గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారతీయ కార్మికులు పనిచేస్తున్నారని, యుద్ధ సంక్షోభం కారణంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపారు.












కామెంట్స్ (1)
Good : )