
జనరల్

ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ భారత్తో జరగనున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా మూడోసారి సెమీస్లో తలపడుతున్న ఇరు జట్ల మధ్య ఎలాంటి రహస్య వ్యూహాలు లేవని ఆయన స్పష్టం చేశాడు. గురువారం ముంబయిలోని వాంఖడే స్టేడియం లో జరిగే పోరుకు ముందు మాట్లాడుతూ, ఇరు జట్లు ఒకరి బలాబలాలను మరొకరు బాగా తెలుసుకున్నాయని తెలిపారు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ద్వారా పరస్పర పరిచయం ఎక్కువగా ఉండటం వల్ల ఆశ్చర్యాలకు తావులేదన్నారు.
ఇదే వేదికపై ఇటీవల Abhishek Sharma 54 బంతుల్లో 135 పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేసిన కరన్, అలాంటి ఇన్నింగ్స్ మళ్లీ జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించాడు. ఇరు జట్లు మైదానం పరిస్థితులు, వ్యూహాలు బాగా తెలుసుకున్న నేపథ్యంలో సెమీఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!