
జనరల్

దేశంలో 2017 నుంచి 2023 వరకు ఏడేళ్ల కాలంలో మొత్తం 1050 ఉగ్రవాద ఘటనలు నమోదయ్యాయని కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో వెల్లడించారు. ఈ ఘటనల్లో 243 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 599 మంది గాయపడ్డారని తెలిపారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా దళాలు నిరంతరం చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అదే కాలంలో ఉగ్రవాదుల దాడుల్లో 288 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని, మరో 802 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్లలో మొత్తం 687 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, మరో 616 మందిని అరెస్ట్ చేసినట్లు నిత్యానంద్ రాయ్ వివరించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!