
జనరల్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం మరణాల సంఖ్యను పెంచింది. ఇప్పటివరకు ఇద్దరు డ్రైవర్లు సహా 20 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. బస్సు మీద పడిన కంకర కారణంగా సహాయక చర్యలు మందగించాయి. రక్షణ పనుల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ శ్రీధర్కి కూడా ప్రమాదం జరిగింది – రెస్క్యూ సమయంలో ఆయన కాలిపై జేసీబీ చక్రం తగిలి గాయాలయ్యాయి. అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటూ గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.












కామెంట్స్ (3)
🥲🥲🥲 This incident making everyone so sad
so sad
Very tragic incident