
జనరల్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ నేటితో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు గజిబిజి లేకుండా తమ పత్రాలు సమర్పించుకునేలా సూచనలు జారీ చేశారు.
మూడు రోజులపాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా, ఈ నెల 30 న స్క్రూటినీ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3 వరకు అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు జిల్లా అధికారులకు ఎన్నికల కమిషన్ వివరణాత్మక మార్గదర్శకాలు అందించింది.
తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించబడుతుంది. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు తగిన బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.












కామెంట్స్ (2)
గ్రామీణ ప్రజాస్వామ్యం సుస్థిరంగా సాగాలి!
Smooth process